జగిత్యాల : కరోనా బాధితులకు అండగా ఉంటామని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. కొడిమ్యాల మండలం తిప్పయ్యపల్లి, నల్లగొండ, చెప్యాల, రామకిష్టాపూర్, కొండాపూర్ గ్రామాల్లో కరోనా బాధితులను, కరోనాతో చనిపోయిన వారి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..కరోనా వచ్చినవారు మనోధైర్యం కోల్పోవద్దన్నారు. కరోనా బాధితులకు అండగా ఉంటామన్నారు. కరోనా వచ్చినవారికి చుట్టుపక్కల వారు మనోధైర్యం కల్పించాలని అన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని భౌతిక దూరం పాటించాలని ఎమ్మెల్యే సూచించారు.
ఇవి కూడా చదవండి..
వ్యాక్సిన్ల కొరత : మోదీ సర్కార్ పై చిదంబరం ఫైర
అనుమానాస్పదస్థితిలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి
రైతులు అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం