కుత్బుల్లాపూర్ : నగరంలో దారుణ ఘటన చోటు చేసుకున్నది. అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రిని ఓ కొడుకు కిరాతకంగా కొట్టిచంపాడు. ఈ ఘటన జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలోని కుత్బుల్లాపూర్లో చోటు చేసుకున్నది. సత్యనారాయణ (63) అనే వ్యక్తి ఐదేళ్లుగా పక్షవాతంతో బాధపడుతున్నాడు. గతరాత్రి మద్యం మత్తులో తండ్రి వద్దకు వచ్చి ఆరోగ్యం విషయంలో సురేష్ (43) గొడవపడ్డాడు. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన సురేష్ బెల్ట్, కర్రతో సత్యనారాయణపై దాడి చేశాడు. గాయాలకు సత్యనారాయణ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.