సిమ్లా : నిద్ర సరిగా రావడం లేదని, పీడకలలు వస్తున్నాయని ఓ యువకుడు తన జీవితాన్ని ముగించాడు. ఈ విషాద ఘటన హిమాచల్ప్రదేశ్లోని కులూ జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. కులూ జిల్లాలోని బంజార్ ఏరియాలో ఓ 17 ఏండ్ల యువకుడు తన తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. ఆ అబ్బాయి 11వ తరగతి చదువుతున్నాడు. అయితే గత ఆరేడు రోజుల నుంచి ఆ యువకుడు సరిగా నిద్ర పోవడం లేదు. రాత్రి సమయాల్లో భయపడుతూ లేచి కూర్చొనేవాడు. పీడకలలు పడుతున్నాయని ఆందోళన చెందేవాడు. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన విద్యార్థి తన జీవితాన్ని ముగించాడు. అతని గదిలో సూసైడ్ నోట్ లభించింది. నిద్ర లేకపోవడం, పీడ కలలు పడటంతోనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు బాధితుడు లేఖలో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం డెడ్బాడీని ఆస్పత్రికి తరలించారు. యువకుడి కుటుంబ సభ్యుల వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేశారు. నిన్న సాయంత్రం ఇంటికి వచ్చి చూడగా తమ సోదరుడి మృతదేహం కనిపించిందని అతని సోదరి తెలిపింది.