హైదరాబాద్ : సికింద్రాబాద్ నుంచి ముంబైకి గంజాయి తరలిస్తున్న ముఠాను రైల్వేపోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా రైల్వే పోలీస్ డీఎస్పీ చంద్రభాను శనివారం మీడియాకు వివరాలు వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం రైల్వేస్టేషన్లోని వెయిటింగ్ హాలులో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఆరుగురు వ్యక్తులను గుర్తించి, వారిని వెంబడించి అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. ఈ ముఠా సికింద్రాబాద్ మీదుగా ముంబైకి గంజాయిని కోణార్క్ ఎక్స్ప్రెస్లో రవాణా చేస్తున్నారని తెలిపారు.
ఒడిశాకు చెందిన నలుగురిని, ముంబైకి చెందిన ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. రూ.16లక్షల విలువైన 54కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఒడిశాకు ఏజెన్సీ ప్రాంతాల నుంచి సికింద్రాబాద్ మీదుగా కోణార్క్ ఎక్స్ప్రెస్లో రవాణా చేస్తున్నారని పేర్కొన్నారు. గంజాయిని తీసుకువెళ్లేందుకు ముంబై నుంచి వచ్చిన వారిరి సైతం అరెస్టు చేసినట్లు వివరించారు. ఆరుగురిపై పిడియాక్ట్ నమోదు చేస్తామని, గంజాయి ముఠాపై ఇప్పటికే మూడు కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. గంజాయి అమ్మినా, విక్రయించినా.. చట్టపరమైన చర్యలుంటాయని హెచ్చరించారు.