జైపూర్ : రాజస్ధాన్లోని హనుమాన్ఘఢ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదంలో (Road Accident) ఒకే కుటుంటానికి చెందిన ఏడుగురు వ్యక్తులు మరణించారు. హనుమాన్ఘఢ్-సర్ధార్షహర్ హైవేపై వారు ప్రయానిస్తున్న కారు ట్రక్కును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ఆదివారం తెలిపారు. శనవారం రాత్రి ఈ ప్రమాదం జరిగిందని, సమాచారం తెలిసిన వెంటనే ఘటనా స్ధలానికి చేరుకున్నామని పోలీసులు చెప్పారు.
ప్రమాదం జరిగిన సమయంలో పిల్లలతో సహా 9 మంది కారులో ప్రయాణిస్తున్నారు. ప్రమాదంలో ఏడుగురు కుటుంబసభ్యులు ఘటనా స్ధలంలోనే మరణించగా ఇద్దరికి గాయాలయ్యాయి. వారు ప్రయాణిస్తున్న కారు సిమెంట్ లోడ్తో వెళుతున్న ట్రక్ను ఢీ కొనడంతో ఈ దుర్ఘటన జరిగింది.
గాయపడిన ఇద్దరిని ప్రాధమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం బికనీర్ ఆస్పత్రికి తరలించారు. ట్రక్ అతివేగంతో దూసుకెళ్లడం వలనే ఈ ఘటన జరిగిందని పోలీసులు చెబుతున్నారు. బాధిత కుటుంబం రాజస్ధాన్లోని హనుమాన్ఘఢ్ సమీపంలో నురంగ్దేశర్ గ్రామానికి చెందినదని పోలీసులు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
Read More :
Devara Movie | దేవర సినిమాలో మంచు లక్ష్మీ.. ఇది నిజమైతే అరాచకమే..!