హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ అధికారుల తనిఖీలు చేపట్టారు. అక్రమంగా బంగారం తరలిస్తున్న ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రియాద్ నుంచి హైదరాబాద్కు వచ్చిన సురేందర్ అనే వ్యక్తి తన లో దుస్తుల్లో బంగారం కడ్డీని దాచుకుని వస్తున్నాడనే పక్కా సమాచారంతో కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు.
సోదాల్లో అతని వద్ద బంగారం కడ్డీ పట్టుబడింది. బంగారం కడ్డీని స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
విషాదం : పెద్దాపూర్లో పిడుగు పాటుకు ఇద్దరు మృతి
Biggboss Season 5 Telugu| రెండో వారం నామినేషన్స్లో ఉన్నది వీళ్లేనా..?