బండ్లగూడ: పాఠశాలలు పునః ప్రారంభం కావడంతో రంగారెడ్డి జిల్లా రవాణశాఖ అధికారులు బుధవారం ప్రైవేటు పాఠశాలల బస్సుల పై కొరడా ఝలిపించారు. రంగారెడ్డి జిల్లా ఉప రవాణశాఖ అధికారి ప్రవీణ్ రావు అదేశాల మేరకు హైదర్షాకోట్ గ్రామంలో గంట పాటు పాఠశాలల బస్సుల తనిఖీలు చేపట్టారు.
బస్సులకు సంబంధించిన పత్రాలను పరిశీలించారు. ఫిట్నెస్, పర్మిట్, ట్యాక్స్లేకుండా నడుపుతున్న 12 బస్సులను సీజ్ చేశామని రంగారెడ్డి జిల్లా ఉప రవాణ శాఖ అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో సీనియర్ మోటర్ వెహికిల్ ఇన్ స్పెక్టర్ సురేందర్రెడ్డి,సత్యనారయణ,సిబ్బంది తదితరులు ఉన్నారు.