న్యూఢిల్లీ : రాజస్ధాన్లోని జోధ్పూర్లో పదకొండో తరగతి విద్యార్ధినిపై లైంగిక దాడికి పాల్పడిన ప్రైవేట్ స్కూల్ టీచర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. టీచర్తో పాటు బాలికపై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ముగ్గురు యువకులనూ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నిందితులు మూడేండ్లుగా తనపై లైంగిక దాడికి పాల్పడుతున్నారని ఈ విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని వారు బెదిరిస్తున్నారని బాలిక తెలిపింది. స్కూల్ టీచర్ ఇంట్లోని బాత్రూంలో బాలికను అపస్మారక స్ధితిలో గుర్తించామని బాధితురాలి సోదరుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. బాలికను ఆస్పత్రికి తరలించామని స్పృహవచ్చిన తర్వాత ఘటన వివరాలను తెలిపిందని చెప్పాడు.
కారులో ఓ వ్యక్తి బలవంతంగా తనను ఎక్కించుకుని టీచర్ ఇంటికి తీసుకువెళ్లాడని బాధితురాలు తెలిపింది. ఆపై లైంగిక దాడికి పాల్పడ్డారని మూడేండ్లుగా టీచర్తో పాటు ముగ్గురు యువకులు లైంగికంగా వేధించారని పేర్కొంది. కేసు నమోదు చేసి టీచర్ సహా నిందితులను అరెస్ట్ చేశామని బాలిక స్టేట్మెంట్ను రికార్డు చేస్తామని మతోరా ఎస్పీ ఇమ్రాన్ ఖాన్ వెల్లడించారు.