వేంసూరు: అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తహసీల్దార్ ఎండీ. ముజాహిద్ తెలిపారు. దీనిలో భాగంగా బుధవారం తెల్లవారుజామున దుద్దేపూడి వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న సదాశివునిపేటకు చెందిన రెండు ట్రాక్టర్లను తమ సిబ్బంది పట్టుకుని సీజ్ చేయడం జరిగిందన్నారు. మరోసారి ఇలాంటివి జరగకుండా ఒక్కో ట్రాక్టర్కు రూ.5వేల చొప్పున జరిమానా విధించడం జరిగిందన్నారు. అనుమతులు లేకుండా ఎవరైనా ఇసుక గానీ, మట్టి గానీ తరలిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు భారీ జరిమానాలు విధిస్తామని ఆయన పేర్కొన్నారు.