అమరావతి : ఏపీలోని ప్రభుత్వ ఆస్పత్రిలో వసతులు అందుబాటులో లేక రోగులు, వారి కుటుంబ సభ్యులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. తిరుపతి రుయా ఆస్పత్రిలో ఇటీవల ప్రభుత్వ అంబులెన్స్ అందుబాటులో లేకపోవడం, ప్రైవేట్ అంబులెన్స్ల డిమాండ్ను తట్టుకోలేక ఓ నిరుపేద తండ్రి తన కుమారుడి మృతదేహాన్ని బైక్పై తీసుకెళ్లాడు. ఈ ఘటనను మరువక ముందే నెల్లూరు జిల్లాలో అలాంటి విచారక ఘటన వెలుగులోకి వచ్చింది.
జిల్లాలోని సంగం గ్రామంలో ఉన్న కనిగిరి రిజర్వాయర్లో ప్రమాదవాశాత్తు ఈశ్వర్, శ్రీరామ్ అనే చిన్నారులు మునిగి మృతి చెందారు. అయితే తన కొడుకు శ్రీరామ్ ప్రాణాలతో ఉన్నాడని ఆశతో కుటుంబ సభ్యులు, స్థానికులు కలిసి సంగం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే శ్రీరాం అప్పటికే చనిపోయాడని వైద్యులు ధ్రువీకరించడంతో మృతదేహాన్ని ఇంటికి తరలించేందుకు 108 అంబులెన్స్కు ఫోన్ చేశారు. నిబంధనల మేరకు మృతదేహాన్ని 108 అంబులెన్స్లో తరలించరాదని వారు వెల్లడించడంతో ఆటోలో తీసుకెళ్లాలని అక్కడి వైద్య సిబ్బంది ఉచిత సలహా ఇచ్చి చేతులు దులుపుకున్నారు.
ఆస్పత్రిలో మహాప్రస్థానం అందుబాటులో లేక, ఆటోలు సైతం తాము రాలేమని చెప్పడంతో కొడుకు మృతదేహాన్ని తండ్రి తన బైక్పై ఇంటికి తీసుకెళ్లిన ఘటన స్థానికంగా విషాదం నింపింది .
,