జయశంకర్ భూపాలపల్లి : ఆర్టీసీ బస్సు బైక్ను ఢీ కొట్టిన ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన కాటారం మండలంలోని బూడిదపల్లి సమీపంలో చోటు చేసుకుంది. మంచిర్యాల జిల్లా చెన్నూరు నుంచి అన్నారం బ్యారేజీ మీదుగా కాటారంకు వస్తున్న ఆర్టీసీ బస్సు బూడిదపల్లి సమీపంలో గంగారం వైపునకు వెళ్తున్న బైక్ ఎదురెదురుగా ఢీ కొన్నాయి.
బైక్ పై ప్రయాణిస్తున్న ధన్వాడ, గంగారం గ్రామాలకు చెందిన యువకులు కోరుకొప్పుల అంజి, ఇశ్రాయేల్, చికట్ల అంజి, ములుకల వరుణ్ తీవ్ర గాయాల పాలయ్యారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
నిజామాబాద్ జిల్లాలో దారుణం..నీటిగుంతలో రెండు మృత దేహాలు
20 మిలియన్ల అభిమానాన్ని పొందిన రష్మిక
Space Wedding : అంతరిక్షంలో వరుడు.. టెక్సాస్లో వధువు.. వీడియో కాల్లో పెండ్లి
OBC Bill: కోటాపై సీలింగ్ను ఎత్తివేయండి : అధిర్ రంజన్ చౌదరీ