కరీంనగర్ : ఏసీబీ వలకు ఓ అవినీతి చేప చిక్కింది. పదిహేడు వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఓ అధికారి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో కాంట్రాక్టర్ మధు దగ్గర నుంచి 17 వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పీవీ రామన్ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు.
ఈఈ రామన్ కు సంబంధించిన హైదరాబాద్, జగిత్యాల, కరీంనగర్ ఇండ్లలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.