భద్రాచలం: భద్రాచలం పట్టణంలో ఇటీవల గంజాయి ఎక్కువగా పట్టుబడుతుండటంతో ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జీ. అంజన్ రావు భద్రాచలంపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా డీసీ ఆదేశాల మేరకు ఖమ్మం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టీం పట్టణంలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించింది. బుధవారం తనిఖీ చేస్తుండగా బస్టాండ్ ఎదుట ఉన్న ఆటో స్టాండ్ వద్ద బ్యాగ్తో అనుమానస్పదంగా తిరుగుతున్న మధ్యప్రదేశ్కు చెందిన విక్రాంత్ ఠాగూర్ అనే వ్యక్తిని సోదా చేయగా అతని బ్యాగ్లో 10.5కేజీల గంజాయి లభించింది.
అతనిపై కేసు నమోదు చేసి భద్రాచలం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్కు తరలించారు. పట్టుబడిన గంజాయి విలువ రూ. 1లక్ష ఉంటుందని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ వై. సర్వేశ్వర్ తెలిపారు. ఈ తనిఖీల్లో ఎస్సై కుమారస్వామి, కానిస్టేబుల్స్ సుధీర్, హరీష్, వెంకట్, హన్మంతరావు పాల్గొన్నారు.