మధ్యప్రదేశ్లోని శివపురి నగరంలో రోజురోజుకూ దొంగతనాల కేసులు పెరిగిపోతున్నాయి. ఎంతటి దొంగలైనా పోలీసులంటే భయపడుతారు. కానీ అక్కడ ఏకంగా ఒక పోలీసు ఉన్నతాధికారి(ఐపియస్ ఆఫీసర్) పెళ్లిలోనే దొంగలు పడ్డారు. అందరూ పెళ్లి వేడుకలో ఉండగా.. అక్కడి నుంచి నగలు, క్యాష్ మాయం చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్లోని శివపురికి చెందిన ఐపియన్ అధికారి నరేంద్ర సింగ్ వివాహంలో స్టేజిపై వధూ వరుల ప్రత్యేక కార్యక్రమం జరుగుతున్న సమయంలో పెళ్లికూతురు వైపు బంధువులు ఉన్న విశ్రాంత గదిలో దొంగలు చొరబడ్డారు. అక్కడ నుంచి ఖరీదైన బంగారు నగలు, క్యాష్ తీసుకొని మాయమైపోయారు.
దొంగతనం జరిగిన విషయం తెలియగానే.. పెళ్లిపెద్దలు సీసీటీవి వీడియో చూసి షాకయ్యారు. అందులో దొంగలు.. బంధువుల వేషధారణలో వచ్చారు. వారు కూడా పెళ్లికి మంచి బట్టలు ధరించి హుందాగా వచ్చారు.
పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు చేసి దొంగల కోసం గాలిస్తున్నారు.