పనాజీ: ఒక ఇంట్లో దొంగలు పడ్డారు. లక్షల విలువైన బంగారు ఆభరణాలు, వస్తువులు చోరీ చేశారు. అనంతరం అక్కడ ‘ఐ లవ్ యూ’ అని రాశారు. గోవాలోని మార్గోవో పట్టణంలో ఈ సంఘటన జరిగింది. అసిబ్ జెక్ అనే వ్యక్తి సోదరుడి పెళ్లి జరుగడంతో మంగళవారం వివాహ విందు ఏర్పాటు చేశారు. దీంతో ఆ ఇంటి వారంతా రిసెప్షన్ జరిగే ఫంక్షన్ హాల్కు వెళ్లారు. అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు తిరిగి ఇంటికి చేరుకున్నారు.
అయితే ఇంట్లో వస్తువులు చిందర వందరగా పడి ఉండటంతో దొంగతనం జరిగినట్లు గ్రహించారు. బాత్ రూమ్ కిటికీ గ్రిల్ తొలగించి ఉండటంతో దొంగలు అక్కడి నుంచి ఇంట్లోకి చొరబడినట్లు భావించారు. రూ.20 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రూ.1.5 లక్షల నగదు చోరీ అయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే చోరీ అనంతరం దొంగలు ఆ ఇంట్లోని టీవీ సెట్పై ‘ఐ లవ్ యూ’ అని అని మార్కర్తో రాసినట్లు పోలీసులకు చెప్పారు.
కాగా, ఆ ఇంటికి వచ్చిన పోలీసులు చోరీ జరిగిన తీరును పరిశీలించారు. డాగ్ స్క్వాడ్, ఫింగర్ ప్రింట్ నిఫుణులను రప్పించి ఆధారాలు సేకరించారు. ఈ దొంగతనంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.