అమరావతి : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం( Road Accident ) జరిగింది. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తిని చూసేందుకు వెళ్లిన స్థానికులపై మరో లారీ ఢీ కొట్టడంతో మరో ఇద్దరు మృత్యువాత పడ్డారు. కర్నూలు జిల్లా చెన్నమ్మ కూడలి వద్ద జరిగిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి .
బుధవారం ఉదయం కూడలి వద్ద ఓ లారీ ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో ద్విచక్రవాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తిని చూసేందుకు వెళ్లిన స్థానికులపై మరో లారీ ఢీ కొట్టింది . దీంతో ఇద్దరు మృతి చెందగా , పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.