బెంగళూర్ : మైసూరులోని బన్నూర్ ప్రాంతంలోని ఓ బార్లో ప్రత్యర్ధి గ్యాంగ్ ఓ వ్యక్తిపై బీరు బాటిల్స్తో దాడికి తెగబడింది. బార్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో ఈ ఘటన రికార్డయింది. బన్నూర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదవగా ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు పరారీలో ఉన్న ఇతర నిందితుల కోసం గాలిస్తున్నారు.
మరో గ్యాంగ్కు చెందిన బాధితుడు దయానంద్పై కూడా పలు కేసులున్నాయని పోలీసులు తెలిపారు. బన్నూర్కు చెందిన ప్రత్యర్ది గ్యాంగ్ సభ్యుడు దయానంద్పై నలుగురైదుగురు బీరు బాటిళ్లతో దాడి చేశారని, పాత కక్షలతోనే ఈ ఘటన జరిగిందని మైసూరు ఎస్పీ ఆర్ చేతన్ వెల్లడించారు. దయానంద్ పిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నామని చెప్పారు.