షాబాద్ : ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన యువతీ అదృశ్యమైన సంఘటన షాబాద్ పోలీసే స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ ఆశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. షాబాద్ గ్రామానికి చెందిన మనిషా (19) అనే యువతి ఆగస్టు 6వ తేదీన ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. అప్పటి నుంచి బంధువుల, స్నేహితుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. యువతీ ఆచూకీ తెలిసిన వారు 9912857257/9440627257కి సమాచారం అందించాలని తెలిపారు.