షాద్నగర్రూరల్ : ఓ మహిళ అదృశ్యమైన సంఘటన ఫరూఖ్నగర్ మండలంలోని చిన్న చిల్కమర్రి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన నర్సింహులు భార్య సుజాత(34) ఈ నెల 10న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. నర్సింహులు ఆమె కోసం బంధువులు, ఇతర ప్రాంతాల్లో వెతికిన ఆచూకీ లభించలేదు. మహిళ రంగు నలుపు, ఎత్తు 5.4 ఉంటుందని తెలిపారు.
ఆచూకీ తెలిసిన వారు 9542086013ను లేదా షాద్నగర్ పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.