రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా ఎస్సీ వెల్ఫేర్ ఆఫీసర్ రామ్మోహన్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. రూ. 40 వేలు లంచం తీసుకుంటుండగా రామ్మోహన్ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. రామ్మోహన్తో పాటు అటెండర్ షకీల్ను పోలీసులు అరెస్టు చేశారు. మన్సురాబాద్కు చెందిన సోమయ్య తన ఇంటిని ఎస్సీ హాస్టల్ను కిరాయికి ఇచ్చాడు.
అయితే కిరాయి బిల్లు మంజూరు చేయాలని రామ్మోహన్ను సోమయ్య కోరారు. ఆ బిల్లు మంజూరుకు అటెండర్ ద్వారా రామ్మోహన్ రూ. 40 వేలు లంచం డిమాండ్ చేశాడు. తన వద్ద అంత డబ్బు లేకపోవడంతో సోమయ్య ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. మొత్తంగా ఇవాళ లంచం తీసుకుంటుండగా రామ్మోహన్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.