హయత్నగర్ రూరల్ : రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్పేట వద్ద విజయవాడ జాతీయ రహదారిపై శనివారం ఉదయం 10గంటల సమయంలో 8 కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. వివరాల్లోకి వెలితే.. శనివారం ఉదయం ఎడతెరిపి లేకుండా ముసురు కురుస్తుంది. విజయవాడ రహదారిపై వాహనాలు వేగంగా దూసుకుపోతున్నాయి. హైవేపై వెళ్తున్న ఒక లారీ డ్రైవర్ సడన్గాబ్రేక్ వేశాడు. దీంతో దాని వెనుక ఉన్నకార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఎనిమిది కార్లు ఢీకొని ధ్వంసం అయ్యాయి. కార్లలోని పలువురికి స్వల్ప గాయాలయ్యాయి.
అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ప్రమాదం జరగడంతో హైవేపై కొద్దిసేపు భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ట్రాఫిక్ను పునరుద్ధరించారు.