ఆమనగల్లు : టీ20 వరల్డ్కప్ సంబంధించి బెట్టింగ్ పాల్పడిన ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేశారు. మంగళవారం సీఐ ఉపేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. చంద్రాయిన్పల్లి తండాకు చెందిన జాటావత్ ఆశోక్, రాంచందర్, గోపాల్ అనే యువకులు సోమవారం రాత్రి విఠాయిపల్లి వద్ద అక్రమార్జన కోసం ఆన్లైన్ బెట్టింగ్ పాల్పడుతున్నట్టు విశ్వసనీయ సమాచారం వచ్చింది. దీంతో ఎస్సై ధర్మేశ్ ఆధ్వర్యంలో సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని బెట్టింగ్కు పాల్పడిన యువకులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ. 20వేల నగదు, మూడు సెల్ఫోన్లను స్వాదీనం చేసుకున్నామని తెలిపారు. నిందితులు ఆదివారం జరిగిన ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్లో కూడా బెట్టింగ్కు పాల్పడ్డారు.
బెట్టింగ్ పాల్పడిన వారిని అదుపులోకి తీసుకోవడంలో తమ విధీ నిర్వహణలో క్రీయశీలకంగా వ్యహరించిన హెడ్కానిస్టేబుల్ శ్రీనివాసగౌడ్, కానిస్టేబుల్ శ్రీనివాస్, ఆశోక్, శివకుమార్, పుష్పలత, ఎస్పీఓ పెద్దయ్యను సీఐ అభినందించారు. ఏవరైనా సర్కిల్ పరిధిలో చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే అట్టి వారికి జైలు శిక్ష తప్పదని ఆయన హెచ్చరించారు.