కొత్తూరు రూరల్ : చికిత్స పొందుతూ యువకుడు మృతిచెందిన సంఘటన కొత్తూరు మండలంలో శనివారం చోటు చేసుకుంది. సీఐ భూపాల్శ్రీధర్ తెలిపిన కథనం ప్రకారం.. కొత్తూరు మండల పరిధిలోని పెంజర్ల గ్రామానికి చెందిన మాసని ప్రేమ్రాజ్ (22) కొంతకాలంగా మద్యానికి బానిసై తన తల్లిదండ్రులను బైక్, సెల్ఫోన్ ఇప్పించాలని ప్రతిరోజు ఇబ్బందులకు గురి చేశాడు. తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవటంతో అందుకు నిరాకరించారు. దీంతో మనస్థాపానికి గురైన ప్రేమ్రాజ్ ఈ నెల 1న రాత్రి సమయంలో ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు.
మంటలు ఎగిసి పడుతుండటంతో గమనించిన ఇరుగుపొరుగు మంటలను ఆర్పి కుటుంబ సభ్యులకు సమాచారాన్ని అందించటంతో టాటిన ప్రైవేట్ వాహనంలో ఉస్మానియా దవాఖానకు తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతున్న ప్రేమ్రాజ్ పరిస్థితి విషమించటంతో మృతి చెందాడు. ఈ సంఘటనపై మృతుడి తండ్రి అంతయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ భూపాల్శ్రీధర్ తెలిపారు.