పీర్జాదిగూడ, ఆగస్టు : గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తూ ఇతరరాష్ట్రాల మద్యం విక్రయిస్తున్న ఓ ఇంటి పై మల్కాజిగిరి జోన్ ఎస్వోటీ పోలీసులు దాడి చేసి నిర్వాహుకురాలితో పాటు ముగ్గురిని అదుపులోకి తీసుకున్న సంఘటన మేడిపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం ప్రకారం.. బోడుప్పల్కు సరస్వతి కాలనీలో నివాసం ఉంటున్న కొండ శివానిగౌడ్ (47) నిర్వాహుకురాలు ఇంట్లో గత కొన్ని నెలల నుంచి ఇతర ప్రాంతాలను నుంచి యువతులను రప్పించి గుట్టు చప్పుడుకాకుండా వ్యభిచారం నిర్వహిస్తుంది.
విశ్వసనీయ సమాచారం మేరకు మల్కాజిగిరి జోన్ ఎస్వోటీ పోలీసులు సోమవారం రాత్రి ఆ ఇంటిపై దాడి చేశారు. ఈ దాడిలో నిర్వాహుకురాలుతో పాటు యువతి, ఇద్దరు విటులు పీర్జాదిగూడ శ్రీరాంనగర్ కాలనీకి చెందిన అలగొండ జగదీశ్వర్(52), దమ్మాయిగూడ గాయిత్రి నగర్కు చెందిన మదునూరి నాగ వెంకట గోపాల కృష్ణ (45) అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.2.750వేలు, 3సెల్ఫోన్లతో పాటు అక్రమంగా విక్రయిస్తున్న ఇతర రాష్ట్రాలకు చెందిన 24మధ్యం బాటిళ్ళను స్వాధీన పరుచుకుని మేడిపల్లి పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.