హైదరాబాద్ : నల్గొండ జిల్లా నార్కట్పల్లి ఫ్లై ఓవర్పై రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. ఆరెంజ్ ట్రావెల్కు చెందిన బస్సు ముందుగా వెళ్తున్న లారీని ఢీకొట్టింది. దీంతో లారీ బోల్తాపడింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న ఎనిమిది మందికి గాయాలయ్యాయి. ఇందులో ఇద్దరి ప్రయాణికుల పరిస్థితి విషమంగా ఉన్నది. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది వరకు ప్రయాణికులున్నారు. హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్తున్న సమయంలో ఘటన చోటు చేసుకున్నది. లారీ రోడ్డుకు అడ్డంగా పడడంతో దాదాపు మూడు కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అనంతరం లారీని తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.