హైదరాబాద్ : ఖైరతాబాద్ ఆర్టీసీ కార్యాలయం వద్ద ప్రైవేట్ ట్రావెల్కు చెందిన బస్సు బీభత్సం సృష్టించింది. కర్నాటక నుంచి వస్తుండగా బస్సు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి.. పైకి ఎక్కింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది వరకు ప్రయాణీకులు ఉన్నారు. పలువురు స్వల్ప గాయాలతో బయటపడగా.. పెను ప్రమాదం తప్పినట్లయ్యింది. బస్సు నిలిచిపోవడంతో సంఘటనా స్థలంలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపడుతున్నారు. సంఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉన్నది.