ఖమ్మం : ఖమ్మంనగరంలోని మామిళ్లగూడెంలోని ఎస్బీఐ ఏటీఎం చోరీకి పాల్పడుతున్నదొంగలను చాకచక్యంగా వ్యవహారించి పట్టుకున్నారు పోలీసులు. పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్. వారియర్ వీరిని అభినందించి క్యాష్ రివార్డు అందజేశారు. ఏటిఎం చోరికి యత్నించిన నిందితుడు తునికి అనిల్ను పెట్రోలింగ్ పోలీసులు పట్టుకుని ఖమ్మం టూటౌన్ పోలీసులకు అప్పగించినట్లు సీఐ శ్రీధర్ తెలిపారు. అక్టోబర్ 1న అర్థరాత్రి దుండగులు ఏటీఎం గదిలోని సీసీ కెమెరాలు, ఏటీఎం యంత్రంలో నగదు బాక్సును అమర్చే యంత్రాన్నిధ్వంసం చేసి డబ్బు కాజేసేందుకు ప్రయత్నించారు.
ఈ సమయంలో పెట్రోలింగ్కు వెళ్లిన పోలీసులకు అర్ధరాత్రి ఏటీఎం సెంటర్ నుంచి ఓ వ్యక్తి అనుమాద స్పదంగా కనిపించడంతో గమనించి దగ్గరకు వెళ్తుండుగా పోలీసుల రాకను పసిగట్టిన దుండగుడు పారిపోయాడు. అదే రోజు చోరికి రెండు గంటల ముందు పెట్రోలింగ్ నిర్వహిస్తున్న మరో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు అదే వ్యక్తిని ప్రశ్నించారు. బంధువులకు ఆరోగ్యం బాగాలేదని ఆస్పత్రిలో చేర్పించి వస్తున్నానని చెప్పడంతో ఆ వ్యక్తి ఫోటో, వివరాలను తీసుకుని పంపించారు. ఆ వ్యక్తి సమాచారాన్ని పోలీస్ పెట్రోలింగ్ గ్రూప్కు పంపించారు.
మంగళవారం తెల్లవారుజామున ఎన్టీఆర్ సర్కిల్ రోడ్డు వద్ద తిరుగుతున్న నిందితుడిని గుర్తించిన పోలీసు సిబ్బంది వెంటనే అదుపులోకి తీసుకున్నారు. చాకచక్యంగా వ్యవహరించి నిందితుడిని పట్టుకున్న టూ టౌన్ కానిస్టేబుల్ వి.కిషన్, ఎఆర్ కానిస్టేబుల్ ఎం.రవిని విష్ణుఎస్వారియర్ అభినందించి క్యాష్ రివార్డును అందించారు.