న్యూఢిల్లీ : పశ్చిమ ఢిల్లీలోని హరినగర్లో నకిలీ కాల్ సెంటర్ గుట్టును ఢిల్లీ పోలీసులు రట్టుచేశారు. అమెరికన్ ప్రభుత్వ అధికారులుగా నమ్మించి అమెరికన్లను వారి సోషల్ సెక్యూరిటీ నెంబర్ను రద్దు చేస్తామని డబ్బు దండుకుంటున్న 65 మందిని అరెస్ట్ చేశారు. కాల్ సెంటర్ యజమానులు లఖన్ జగ్వానీ, విజేందర్ సింగ్ రావత్లను కూడా అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. అడ్డదారుల్లో అమెరికన్ పౌరుల వివరాలను రాబట్టే వీరు చట్టపరమైన చర్యల నుంచి కాపాడతామని చెబుతూ వారి నుంచి డబ్బు గుంజేవారని వెల్లడైంది.
వీరు మోసగించిన మొత్తం రూ కోట్లలోఉంటుందని ఢిల్లీ పోలీస్ డిప్యూటీ కమిషనర్ (వెస్ట్) ఉర్విజ గోయల్ తెలిపారు. తాము అమెరికన్ కస్టమ్స్ శాఖ, డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ, షెరీష్, ఎఫ్బీఐ, యూఎస్ఏ ట్రెజరీ ఆఫీస్ అధికారులమని చెబుతూ అమెరికన్ పౌరులను బురిడీ కొట్టించారని తెలిసింది. హరినగర్లోని కాల్సెంటర్పై పోలీసులు దాడి చేసిన సమయంలో అక్కడ పలువురు సిబ్బంది అంతర్జాతీయ కాల్స్లో నిమగ్నమయ్యారని పోలీసులు వెల్లడించారు.