Hyderabad | హైదరాబాద్ : బేగంపేటలో ఓ కారు బీభత్సం సృష్టించింది. రోడ్డుపై వెళ్తున్న ఓ యువతిని ఢీకొట్టడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
వివరాల్లోకి వెళ్తే.. నిజాంపేటకు చెందిన కే ప్రియాంక(31), బేగంపేటలోని ఓ ప్రయివేటు స్టోర్లో పని చేస్తోంది. దీంతో ప్రియాంక సోమవారం ఉదయం నిజాంపేట నుంచి బేగంపేటకు చేరుకుంది. ప్రకాశ్నగర్ మెట్రో స్టేషన్ వద్ద ఆమె రోడ్డు దాటుతుండగా.. వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది.
తీవ్ర గాయాలతో బాధపడుతున్న ఆమెను పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బాధితురాలు మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కారు డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కింగ్కోఠిలో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలు మృతి చెందిన సంగతి తెలిసిందే. పారిశుద్ధ్య కార్మికురాలు సునీత.. కింగ్ కోఠిలో రోడ్డు పక్కనే ఉన్న చెట్టు వద్ద శుభ్రం చేస్తున్నది. ఈ క్రమంలో వేగంగా దూసుకొచ్చిన అయాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజీ బస్సు అదుపుతప్పి సునీతను ఢీకొట్టింది. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. తోటి సిబ్బంది వెంటేనే ఆమెను ఉస్మానియా దవాఖానకు తరలించారు.
అయితే అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బస్సును సీజ్ చేసి డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.