హైదరాబాద్ : మెదక్ జిల్లాలో పెద్ద ఎత్తున రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. నర్సాపూర్ మండలం కాగజ్ మద్దూర్లోని శివసాయి ఇండ్రస్ట్రీస్పై దాడి చేసి 1500 నుంచి 2వేల క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ కే మనోహర్ తెలిపారు. మిల్లు యజమాని శ్రీధర్ గుప్తా పెద్ద ఎత్తున అక్రమంగా రేషన్ బియ్యం నిలువ చేయడంతో పాటు 25 నుంచి 30 వాహనాల్లో లోడ్ చేసిన బియ్యాన్ని తరలించేందుకు యత్నిస్తుండగా ఆర్సీపురం యూనిట్ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. అనంతరం పౌర సరఫరాల శాఖ అధికారులు, స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.