నీలగిరి: నల్గొండ మండలంలోని ముషంపల్లి గ్రామంలో ఓ మహిళను అత్యాచారం చేసి అనంతరం హత్య చేసిన నిందితులపై పీడీ యాక్టు నమోదు చేశారు పోలీసులు. మంగళవారం రాత్రి నిందితులను చంచల్గూడ జైలుకు తరలించినట్లు నల్గొండ రూరల్ ఎఎస్ఐ అహ్మద్ షరీఫ్ తెలిపారు. ఈ హత్య కేసులో నిందితులైన ఎరుపుజర్ల శంకర్, బక్కతట్ల లింగయ్య లపై పీడీ యాక్టు కేసు నమోదు చేసి జైలుకు తరలించినట్లు తెలిపారుపోలీసులు.