చార్మినార్ : యువతను మత్తుకు బానిసలుగా మారుస్తూ గంజాయికి అలవాటు చేస్తున్న గంజాయి విక్రేతలపై దక్షిణ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు పీడీ యాక్ట్ ను ప్రయోగించారు.
ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర తెలిపిన వివరాల ప్రకారం ఓల్డ్ మలక్పేట్ ప్రాంతానికి చెందిన మహ్మద్ ఖదీర్ (27) , ఫలక్నుమా పోలీస్ స్టేషన్ పరిధిలోని వట్టేపల్లి ప్రాంతానికి చెందిన మహ్మద్ అబ్థుల్ రవూఫ్ (30) చాంద్రయణగుట్ట ప్రాంతానికి చెందిన మహ్మద్ ముజీబ్ (31)లు గత కొంతకాలంగా గుట్టు చప్పుడు కాకుండా గంజాయి విక్రయాలు కొనసాగిస్తున్నారు.
పలుమార్లు పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినా తన వ్యాపకాన్ని త్యజించకుండా అక్రమ సంపాద నకు అలవాటుపడి గంజాయి క్రయ విక్రయాలు సాగిస్తున్నారు. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గంజాయి, డ్రగ్స్పై ఉక్కుపాదం మోపాలంటూ అదేశించడంతో గంజాయి విక్రయదారులపై పోలీసులు కఠినచర్యలు తీసుకుంటున్నారు.
ఈ క్రమంలో దక్షిణ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు పాతనగరంలోని వివిధ ప్రాంతాల్లో గంజాయి అమ్మకాలు సాగిస్తున్న వారిపై పీడీయాక్ట్లను ప్రయోగించాలని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్కు సిఫార్సు చేశారు. టాస్క్పోర్స్ ఇన్స్పె క్టర్ రాఘవేంద్ర సిఫార్సుమేరకు నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ నిందితులపై పీడీయాక్ట్ ను ప్రయోగించారన్నారు.