న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఆక్సిజన్ (Oxygen) సిలిండర్లు ఇప్పిస్తామని ప్రజలను మోసం చేసిన ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సెకండ్ వేవ్ సమయంలో దేశంలో ఆక్సిజన్ దొరక్క చాలామంది మరణించిన సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో ఆక్సిజన్ సిలిండర్లు ఇప్పిస్తామని ఈ ముఠా మోసాలకు పాల్పడింది.
ఈ ముఠా సభ్యులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తు సందర్భంగా నిందితులు తమ నేరాలను అంగీకరించినట్లు అధికారులు తెలిపారు. సుమారు వెయ్యి మందిని మోసం చేసి, దాదాపు రూ.1.5 కోట్లు కాజేసినట్లు నిందితులు ఒప్పుకున్నారట.
ఈ ముఠా నుంచి 9 మొబైల్స్, ఒక ల్యాప్టాప్, 11 సిమ్కార్డులు, 9 ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.