ముంబై : సైబర్ నేరాలపై ప్రభుత్వం, పోలీసులు ప్రజల్లో అవగాహన పెంచుతున్నా ఆన్లైన్ వేదికగా సైబర్ నేరగాళ్లు చెలరేగుతున్నారు. అమాయకులను మభ్యపెడుతూ అడ్డదారుల్లో అందినకాడికి దోచుకుంటున్నారు. రోజుకో తరహా స్కామ్తో రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు తాజాగా నాగపూర్కు చెందిన ఓ వ్యాపారిని ఏకంగా రూ. 58 కోట్లకు (Online Gaming Scam) ముంచేశారు.
ఆన్లైన్ జూదంలో ఫ్రెండ్ చేతిలోనే వ్యాపారి అడ్డంగా మోసపోయారు. బాధితుడి ఫిర్యాదు ఆధారంగా అనుమానితుడి ఇంటిపై పోలీసులు దాడి చేసి 14 కిలోల బంగారంతో పాటు రూ. 17 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. అనుమానితుడైన బుకీ బాధితుడిని మోసం చేసేందుకు ఆన్లైన్ గేమింగ్ వేదికను సృష్టించాడు. ఆన్లైన్ గేమ్స్ ఆడే విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఈ ఘటన వెల్లడిస్తోంది. ఆన్లైన్ గేమ్స్ విషయంలో కొత్త వ్యక్తులను, అపరిచితులను అసలు నమ్మవద్దని నిపుణులు సూచిస్తున్నారు.
ఇన్-గేమ్ ఎక్స్లూజివ్ల పేరిట కొందరు ఇచ్చే ఆఫర్ల వలలో పడకుండా యాప్ ఆధారిత పేమెంట్స్ మాత్రమే చేయాలి. వ్యక్తుల వద్ద నగదుతో ఎలాంటి కొనుగోళ్లు జరపకుండా జాగ్రత్త పడాలి. రమ్మీ, పోకర్ వంటి ఆన్లైన్ జూదాలు రిస్క్తో కూడుకున్నవి. ఇందులో మీరు గెలుస్తారనే హామీ లేనందను ఇలాంటి జూదాలకు దూరంగా ఉండటం మేలు. ఆధార్, పాన్, బ్యాంక్ ఖాతా వంటి వ్యక్తిగత వివరాలను ఆన్లైన్లో ఎవరితోనూ పంచుకోవద్దు.
Read More :
Manipur Files | దమ్ముంటే మణిపూర్ ఫైల్స్ తీయండి.. కశ్మీర్ ఫైల్స్ దర్శకుడికి నెటిజన్ సవాలు