నారాయణపేట : జిల్లా పరిధిలోని నర్వ మండలం కల్వల్ వద్ద ఓ ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాద ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.