రంగారెడ్డి : శంషాబాద్ మండల్ కొత్వాల్గూడ సర్వీస్ రోడ్డుపై గురువారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా వెళ్తున్న బైక్.. స్పీడ్ బ్రేకర్ వద్ద అదుపుతప్పింది. దీంతో ఎదురుగా వస్తున్న టిప్పర్ను బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.
మృతుడిని కర్మన్ఘాట్కు చెందిన కాల్వపల్లి నారాయణరెడ్డిగా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.