కీసర : లారీ డ్రైవర్ ( Lorry Driver ) నిర్లక్ష్యంతో ఒకరు మృతి చెందారు. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని కీసర ఓఆర్ఆర్ ( Keesara ORR ) వద్ద చెత్త లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతో ప్రమాదం జరిగింది.
యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండలం మల్యాల గ్రామానికి చెందిన రవీందర్ (54) ద్విచక్ర వాహనంపై కీసర మీదుగా మల్యాలకు వెళ్తుండగా లారీ ఢీ కొంది. దీంతో లారీ వెనుక టైర్ కింద పడి పోయి మృతి చెందాడు. కీసర పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకొని మృత దేహాన్ని గాంధీ దవాఖానకు తరలించారు.