మహబూబ్నగర్ : జిల్లాలోని జడ్చర్ల మండలం ఎక్కువాయపల్లిలో విషాదం నెలకొంది. కుటుంబ కలహాలతో వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. భార్యాభర్తలిద్దరూ శనివారం ఉదయం గొడవపడ్డారు. తీవ్ర మనస్తాపానికి గురైన దంపతులిద్దరూ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతులను విష్ణువర్ధన్ రెడ్డి, కళావతిగా పోలీసులు గుర్తించారు.