కరీంనగర్ : పెళ్లైన రెండు నెలలకే నవ వధువు దారుణ హత్యకు గురైంది. ఈ విషాద సంఘటన కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లిలో చోటుచేసుకుంది. మ్యాదర ప్రవళిక(21) అత్తగారింట్లో ఉండగా గుర్తుతెలియని దుండగులు ఇంట్లోకి ప్రవేశించి గొంతుకోసి దారుణంగా హతమార్చారు. సంఘటన స్థలాన్ని సీపీ కమలాహన్ రెడ్డి, తిమ్మాపూర్ సీఐ శశిధర్ రెడ్డి పరిశీలించారు. హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.