మైలార్దేవ్పల్లి : రోడ్డు ప్రమాదంలో మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్కు చెందిన కానిస్టేబుల్ మృతి చెందాడు.వివరాల్లోకి వెలితే..చర్లపల్లి ప్రాంతంలో నివసించే రాఘవరెడ్డి (54)(1993 బ్యాచ్ ) వెల్దండ మండలానికి చెందిన వారు. గత రెండు సంవత్సరాలుగా మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నారు.
ఇతనికి భార్య ఇద్దరు కూతుళ్లు ఒక కుమారుడు ఉన్నారు. ఆదివారం సెలవు తీసుకోని తమ సొంత ఊరుకు షిఫ్ట్ డిజైర్ కారులో ఒంటరిగా ప్రయాణం చేస్తున్నాడు. కడ్తాల్ ప్రధాన రహదారిలో సాయంత్రం సమయంలో రాంగ్ రూట్లో వస్తున్న ట్రాక్టర్ కారును డీకొట్టింది.
రాఘవరెడ్డికి బలమైన గాయాలు కావడంతో కామినేని దవాఖానకు చికిత్స నిమిత్తం తరలించారు.చికిత్స పొందుతూ అర్థరాత్రి 12 గంటల సమయంలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.మైలార్దేవ్పల్లి ఇన్స్పెక్టర్ కె నర్సింహ ఆయన ఆత్మకు శాంతి చేకురాలని కోరారు.