వికారాబాద్ : ఆస్తి కోసం సొంత తమ్ముడినే హత్య చేసిన సంఘటన వికారాబాద్ పట్టణంలో శనివారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ పట్టణంలోని ఆలంపల్లికి చెందిన అడివిరెడ్డి, ప్రమీలకు ముగ్గురు కొడుకులు ఒక కూతురు ఉన్నారు. వీరికి ఆరు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. చిన్న కుమారుడు గోవర్థన్రెడ్డి(34)ను పెద్ద అన్న అంజిరెడ్డి ఆస్తీ విషయంలో గొడవ పడి శనివారం తెల్లవారు జామున ఇంట్లో అద్దం పగులగొట్టి దాంతో తమ్ముడిపై దాడి చేసి హత్య చేశాడు.
ఆ సమయంలో అంజిరెడ్డి తాగి ఉండటంతో హత్యకు దారి తీసినట్లు తెలుస్తొంది. రెండో తమ్ముడు రఘుపతిరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వికారాబాద్ సీఐ రాజశేఖర్ తెలిపారు.