సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బర్రెలు కడిగేందుకు కుంటలో దిగిన తల్లీకొడుకు నీటమునిగి మృత్యువాత పడ్డారు. ఎస్ఐ విజయకృష్ణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
సోమవారం మధ్యాహ్నం గుమ్మడిదల మండలంలోని కొత్తపల్లి గ్రామంలోగల బూరకుంటలో తమ బర్రెలను కడిగేందుకుగానూ తలారి లక్ష్మి(32), ఆమె కొడుకు తలారి బాలు( 12) దిగారు. ప్రమాదవశాత్తూ ఇద్దరూ నీటమునిగి, మృతి చెందారు. లక్ష్మి భర్త రమేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు తెలిపారు.