అమరావతి : గుంటూరు జిల్లాలో విషాదం నెలకొంది. జిల్లాలోని నూజెండ్ల మండలం అన్నవరంలో కుటుంబ కలహాల కారణంగా ఓ తల్లి ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తాను సేవించింది. ఈ సంఘటనలో తల్లి సౌందర్యతో పాటు ఓ చిన్నారి మృతి చెందగా మరో చిన్నారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.