ముంబై : గత కొద్దినెలలుగా దేశవ్యాప్తంగా సైబర్ నేరగాళ్లు చెలరేగుతున్నారు. రోజుకో స్కామ్తో (Online Scam) అమాయకులను ఆన్లైన్ వేదికగా అడ్డంగా దోచేస్తున్నారు. తాజాగా ముంబైకి చెందిన ఓ ఎమ్మెల్యే కూతురు ఆన్లైన్ స్కామ్లో రూ. 79,000 పోగొట్టుకున్నారు. యాప్లో స్వీట్స్ ఆర్డర్ చేసి పేమెంట్ చేసే క్రమంలో స్కామర్ల చేతిలో మోసపోయారు.
మిరా రోడ్డుకు చెందిన రాజకీయ నేత గీతా జైన్ కుమార్తె స్నేహ సక్లీచ కుటుంబం నిర్వహించే నిర్మాణరంగ కంపెనీ సోనం గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో డైరెక్టర్గా పనిచేస్తోంది. నవంబర్ 9న ఆమె ఇంట్లో ఉన్న సమయంలో స్వీట్స్ కొనుగోలు చేసి రూ. 480 ఆన్లైన్ పేమెంట్ చేసేందుకు ప్రయత్నించింది. ఆపై స్వీట్ షాప్ ఓనర్ జీఎస్టీ కోసం మరికొంత మొత్తం చెల్లించాలని 39,506ను కోడ్ నెంబర్గా ఆమె మొబైల్ పేమెంట్ అప్లికేషన్లో పొందుపరచాలని సూచించాడు.
దీంతో ఆమె అకౌంట్ నుంచి సదరు మొత్తం డెబిట్ కావడంతో రిఫండ్ చేస్తామంటూ నమ్మబలికి ఆమెతో మరో లావాదేవీ ద్వారా మళ్లీ రూ. 39,506 వసూలు చేశాడు. మోసపోయానని గ్రహించిన బాధితురాలు స్కామర్కు కాల్ చేయగా ఎలాంటి స్పందన రాలేదు. బాధితురాలు సైబర్ పోలీసులను సంప్రదించగా కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.
Read More :
Diwali 2023 | సందడంతా మాదే.. సెలబ్రెటీలు పంచుకున్న దీపావళి ముచ్చట్లు..