ముంబై : మహారాష్ట్రలోని థానేలో శనివారం ఓ కాంట్రాక్టర్పై గుర్తు తెలియని దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. అయితే, ఈ ఘటనలో సదరు కాంట్రాక్టర్ తృటిలో తప్పించుకున్నాడు. శనివారం తెల్లవారుజామున 3.45 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు చితల్సర్ పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్స్పెక్టర్ సులభా పాటిల్ తెలిపారు. నగరంలోని ఘోడ్బందర్ రోడ్ ప్రాంతంలో కాంట్రాక్టర్ గణేశ్ కోకటే తన కారులో ప్రయాణిస్తున్నాడు. ఈ క్రమంలోనే ద్విచక్రవాహనంపై వచ్చిన ఐదుగురు గుర్తుతెలియని దుండగులు వారిని అడ్డుకుని కాల్పులు జరిపారు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయారు. కాంట్రాక్టర్ గణేశ్ తృటిలో తప్పించుకోవడం అదృష్టమేనని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.