హైదరాబాద్ : ఓయూ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాణికేశ్వర్ నగర్లో భారీ చోరీ జరిగింది. దుండగులు 90 తులాల బంగారు వడ్డాణం, 20 తులాల లాంగ్ చైన్, నాలుగు లక్షల రూపాయల నగదును ఎత్తుకెళ్లారు. కాగా, ఇది ఇంటి దొంగల పనే అని ఇంటి యజమానురాలు రంగమ్మ అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.