జైపూర్ : పెండ్లయి నలుగురు పిల్లలున్న పూజారి తన బంధువైన మహిళపై కన్నేసి దారుణానికి ఒడిగట్టాడు. పూజ చేసేందుకు వచ్చిన మహిళకు పూజారి మత్తుమందు ఇచ్చి లైంగిక దాడికి పాల్పడిన ఘటన రాజస్ధాన్లోని జైచంద్పురా గ్రామంలో ఆదివారం వెలుగుచూసింది. భర్త, తండ్రితో కలిసి తమ బంధువు అర్చకుడిగా పనిచేస్తున్న ఆలయానికి మహిళ వెళ్లగా, వారిని బయటకు పంపిన నిందితుడు ఒంటరిగా ఉన్న మహిళకు మత్తుమందు కలిపిన పానీయం ఇచ్చి ఆపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
మరుసటి రోజు తన కారులోనే నిందితుడు మహిళను ఆమె ఇంటి వద్ద దింపాడు. జరిగిన విషయం కుటుంబ సభ్యులకు వివరించిన మహిళ వారి సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆపై పోలీసుల అరెస్ట్ చేస్తారనే భయంతో విరాట్ నగర్లోని కొండపై ఉన్న చిన్న గుడిలో నిందితుడు తలదాచుకున్నాడు. నిందితుడి కోసం గాలింపు చేపట్టిన పోలీసులు గురువారం అతడిని అరెస్ట్ చేశారు. బాధితురాలి స్టేట్మెంట్ను రికార్డు చేసి దర్యాప్తు వేగవంతం చేస్తామని పోలీసులు వెల్లడించారు.