పట్నా : వైరల్ సాంగ్స్పై ఇన్స్టాగ్రాం రీల్స్ (Wife Making Insta Reels) చేస్తున్న భార్యను అలా చేయద్దని అన్నందుకు ఓ వ్యక్తిని అత్తింటి వారు కడతేర్చిన ఘటన బిహార్లోని బెగుసరైలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాధితుడు మహేశ్వర్ కుమార్ రాయ్కు ఆరేండ్ల కిందట రాణి కుమారితో వివాహం కాగా, వీరికి ఐదేండ్ల కుమారుడు ఉన్నాడు.
మహేశ్వర్ కుమార్ కోల్కతాలో కూలీ పనులు చేసుకుంటూ ఇటీవలే ఇంటికి తిరిగివచ్చాడు. కుమార్ భార్య ఇన్స్టా రీల్స్ చేయడానికి అలవాటు పడటంతో ఈ విషయం ఇద్దరి మధ్య ఘర్షణకు దారితీసింది. ఇన్స్టా ఖాతాలో రాణి కుమారి 500కుపైగా రీల్స్ చేయగా ఆమెకు 9500 మంది ఫాలోయర్లు ఉన్నారు.
ఇక ఇన్స్టా రీల్స్ విషయమై భార్యాభర్తల మధ్య ఘర్షణ నేపధ్యంలో కుమార్ ఆదివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత అత్తగారింటికి వెళ్లాడు. అక్కడ జరిగిన ఘర్షణలో కుమార్ మరణించాడు. ఘటనా స్ధలానికి చేరుకున్న కుమార్ కుటుంబసభ్యులు అత్తింటి వారే బాధితుడిని హత్య చేశారని ఆరోపించారు.
Read More :
Mahalakshmi Scheme | మహాలక్ష్మి ఎఫెక్ట్.. ఆలయాలు, పర్యాటక ప్రాంతాలకు జనం తాకిడి.. చాలని బస్సులు