ముంబై : తక్కువ ధరకు గోల్డ్ కాయిన్స్ విక్రయిస్తామని నవీ ముంబైకి చెందిన ఓ వ్యక్తిని ఇద్దరు వ్యక్తులు రూ. 1.05 కోట్లకు మోసగించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నీరజ్ ఖన్దగలే, నీతు కదం అనే నిందితులు బాధితుడిని సంప్రదించి భారీ స్కామ్కు తెరలేపారు.
తమకు గోవాలో గోల్డ్ కాయిన్స్తో నిండిన పాత్ర లభ్యమైందని, వీటిని తాము తక్కువ రేటుకు విక్రయిస్తామని నమ్మబలికారు. చౌక ధరలో గోల్డ్ కాయిన్స్ లభిస్తాయనే ఆశతో బాధితుడు 2022 మార్చి 2023 జులై మధ్య పలు వాయిదాల్లో రూ. 1.05 కోట్లు చెల్లించాడు.
పూర్తిస్ధాయిలో చెల్లింపులు జరిపినా బాధితుడికి నిందితులు గోల్డ్ కాయిన్స్ అప్పగించలేదు. మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో ఘరానా మోసం బయటపడింది. కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి దర్యాప్తు ముమ్మరం చేశారు.
Read More :