దుండిగల్ , ఆగస్టు: ఆర్ధిక ఇబ్బందులకు తోడు మద్యానికి అలవాటు పడిన ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఈ సంఘటన దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…సికింద్రాబాద్ కు చెందిన నగేష్గౌడ్ (38) గైడ్గా పనిచేస్తూ ఉపాధిని పొందే వాడు. భార్య ఇద్దరు పిల్లలతో కలిసి నగేష్గౌడ్ గతకొంతకాలం క్రితం నుండి తన మాకాంను దుండిగల్ మున్సిపాలిటీ పరిధి, డీ.పోచంపల్లిలోని 60 గజాల ప్రాంతానికి మార్చాడు. గడిచిన ఏడాదిన్నర కాలంగా కరోనాతో ఉపాధిని కోల్పోయాడు నగేష్గౌడ్.
ఫలితంగా ఆర్ధికంగా ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో నగేష్గౌడ్ మద్యానికి అలవాటు పడ్డాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం భార్య,పిల్లలు చింతల్లోని తనపుట్టింటికి వెళ్లింది. ఈ నేపథ్యంలో రాత్రి మద్యంసేవించిన నగేష్గౌడ్ ఇంట్లో చీరెతో ఉరేసుకున్నాడు. ఇది గమనించిన ఇరుగు,పొరుగు చికిత్స కోసం మల్లారెడ్డి వైద్యశాలకు తరలించగా అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు దృవీకరించారు. మృతుడి సోదరుడు భాస్కర్గౌడ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.